సనాతన ధర్మం – బొట్టు యొక్క పవిత్రత

“బొట్టు లేకుండా ఒక హిందువు ఉండటం అంటే, అది వారి దౌర్భాగ్యం” అని భావించాలి.
బొట్టు మన జీవితానికి పుట్టుక నుండి మరణం వరకు అల్లుకున్న పవిత్ర చిహ్నం.
పుట్టిన 11వ రోజు నుంచి, మరణించిన 11వ రోజు వరకు… చివరికి శవానికి కూడా బొట్టు పెడతారు!
అందుకే—నువ్వు ఏ రకమైన బొట్టు వేసుకున్నా పరవాలేదు.
కానీ నీ నుదురు…
ఒక శ్మశానంలా ఖాళీగా ఉండకూడదు!
నీ నుదురు ఖాళీగా ఉందంటే,
దారిద్య్రాన్ని “ఫ్యాషన్” అని పిలిచి ఆహ్వానిస్తున్నావన్న మాట.
చందనం గుండ్రంగా పెట్టుకుంటావా?
పెట్టుకో! అది పూర్ణత్వానికి సంకేతం!
విభూతి పెట్టుకుంటావా?
పెట్టుకో! అది ఐశ్వర్యానికి ప్రతీక!
ఒక రోజు ఈ శరీరం భస్మంగా మారాల్సిందే కదా?
నామం పెట్టుకుంటావా?
పెట్టుకో! అది చెప్తుంది –
“నువ్వున్న స్థితి నుండి ఉన్నత స్థితికి ఎదగాలి!”
కుంకుమ పెట్టుకుంటావా?
అది సౌభాగ్యానికి సోపానం.
పెట్టి గర్వించు!
సింధూరం పెట్టుకుంటావా?
అది హనుమంతుని ఆశీర్వాదానికి చిహ్నం.
వారి ఆశీస్సు నీతో ఉండాలి.
నుదురులో మధ్యన ఉంది ఆజ్ఞాచక్రం.
ఇది మన 72,000 నాడుల కేంద్ర బిందువు.
అక్కడ… తప్పకుండా ఏదో ఒక బొట్టు పెట్టు!
బొట్టు పెట్టుకుంటే భక్తి కలుగుతుంది, ఆత్మ చైతన్యం జ్వలిస్తుంది.
ఇది అలంకారం కాదు – ఇది ఆధ్యాత్మిక చిహ్నం.
🇮🇳 జై భారత్!
🚩 జై శ్రీరామ్!
🌸 జై జై సీతారామ్!
