కురుక్షేత్ర యుద్ధం భీకరంగా సాగుతోంది.
దుర్యోధనుడి ప్రాణమిత్రుడు, మహాపరాక్రమవంతుడు కర్ణుడి ధాటికి పాండవ సైన్యం నిలువలేకపోతోంది.
సైనికులు వరుసగా మరణిస్తున్నారు.
పాండవ యోధులకు ఏం చేయాలో తోచడం లేదు.

కర్ణుణ్ని ఎదుర్కొనే శక్తి ఒక్క అర్జునుడికే ఉందని ధర్మరాజుకు తెలుసు.
కానీ అర్జునుడు కర్ణుడిని తప్పించి మిగతా యోధులతోనే యుద్ధం చేస్తున్నాడు.
ఇది ధర్మరాజుకు నచ్చలేదు.
అందుకే అర్జునుణ్ని కర్ణుడిపైకి ఉసిగొల్పాలని యోచించాడు.

Advertisement


అపహాస్య వ్యూహం

యుద్ధధర్మం ప్రకారం రోజూ సూర్యోదయం నుంచి సూర్యాస్తమయం వరకే పోరాడాలి.
ఒక రోజు యుద్ధం ముగిసిన వెంటనే, మరుసటి రోజు వ్యూహంపై పాండవులు చర్చిస్తున్నారు.

Advertisement

ఆ సమయంలో ధర్మరాజు అర్జునుడి వైపు తిరిగి —

"నువ్వు నీను గొప్ప పరాక్రమవంతుణ్ని అనుకుంటున్నావు,
కానీ ఒట్టి పిరికివాడివి!
కర్ణుణ్ని ఎదుర్కొనే ధైర్యం నీకు లేదు.
బలహీన సైనికుల మీద ప్రతాపం చూపిస్తున్నావు.
శివుణ్ని మెప్పించి పాశుపతాస్త్రం పొందావు.
గాండీవధారి అనే పేరు మాత్రమే మిగిలింది.
దాన్ని ప్రయోగించటం నీకు రాదా?
లేక అలంకారంగా ఉంచుకోవడానికే పుట్టిందా ఆ అస్త్రం?"

అంటూ కావాలనే అపహాస్యం చేశాడు.


Advertisement

అర్జునుడి కోపం

ధర్మరాజు మాటలు విని అర్జునుడి రోషం ఆకాశాన్ని తాకింది.
శివుడి దగ్గర పాశుపతాస్త్రాన్ని పొందిన రోజునే,
ఎవరైనా ఆ అస్త్రాన్ని అవమానిస్తే వారిని సంహరిస్తానని శపథం చేశాడు.

ఇప్పుడు సాక్షాత్తు అన్నయ్యే గాండీవాన్ని అవమానించాడు!
ఏం చేయాలో అర్థంకాక కృష్ణుడి దగ్గర ఫిర్యాదు చేశాడు.


కృష్ణుని జ్ఞానం

కృష్ణుడు చిరునవ్వుతో అన్నాడు:

Advertisement

"చిన్నవాళ్లు పెద్దవారిని శిక్షించాల్సిన పరిస్థితి వస్తే,
వారిని దుర్భాషలాడటం చాలు.
ఎందుకంటే అది వారికి మరణంతో సమానం."

అందుకే అర్జునుడు ధర్మరాజు దగ్గరికి వెళ్లి —

"మీవల్లే ఈ పరిస్థితులు వచ్చాయి!
మీరు వ్యసనానికి లోనై రాజ్యాన్ని పోగొట్టారు.
మమ్మల్ని పణంగా పెట్టి ఓడిపోయారు.
బానిసలుగా మార్చారు.
ఇవన్నీ మీ వల్లే జరిగాయి!"

అంటూ అన్నదమ్ములందరి ఎదుట నిందలు మోపాడు.


ఆత్మస్తుతి శిక్ష

మాటలతో కోపం తీర్చుకున్నా,
ధర్మమూర్తి అయిన అన్నను నిందించడం అర్జునుడు జీర్ణించుకోలేకపోయాడు.
మనస్తాపంతో మళ్లీ కృష్ణుని వద్ద ప్రాయశ్చిత్తం అడిగాడు.

అప్పుడు కృష్ణుడు నవ్వుతూ అన్నాడు:

"ఇప్పుడు నిన్ను నువ్వు పొగుడుకో!
నలుగురిలో నీ గురించి నీవే గొప్పగా చెప్పుకో.
అదే నీ ప్రాయశ్చిత్తం.
ఎందుకంటే ఆత్మస్తుతి కూడా మరణంతో సమానం."


సారాంశం

ఎవరినీ నిరాధారంగా నిందించకుండా,
ఆత్మస్తుతి చేసుకోకుండా,
నలుగురితో కలసికట్టుగా పయనించేవారే సంఘజీవి అనిపించుకుంటారు.


ఆచార్యులు జీవీయస్‌