ఈశ్వర నామ జపమే తలరాతను మార్చగల శక్తి

తలరాతలో వచ్చిన కష్టాలు, కర్మ బంధాలు, జీవనంలోని గాఢమైన దుఃఖాలను మార్చగల దివ్యశక్తి — ఈశ్వర నామ జపమే.
తలరాతలో వచ్చిన కష్టాలు, కర్మ బంధాలు, జీవనంలోని గాఢమైన దుఃఖాలను మార్చగల దివ్యశక్తి — ఈశ్వర నామ జపమే.
నామస్మరణే మనిషిని లోపల నుంచి మార్చగల మార్గం.
ఒక రైతు విత్తనాన్ని నేలలో నాటినప్పుడు అది తలక్రిందులుగా పడినా, మొక్క మాత్రం పైకే మొలుస్తుంది.
అలాగే భగవన్నామాన్ని ఏ విధంగానైనా జపించినా సత్ఫలితం తప్పక లభిస్తుంది.
మంత్రజపం ద్వారా అవరోధాలు తొలగిపోతాయి; మనస్సు శుభ్రపడి, జీవితం మారడం ప్రారంభమవుతుంది.
కర్మ – మనిషి జన్మకు మూలకారణం
కర్మ ఉన్నందువల్లే ఈ భూమిపై జన్మించాలి.
భగవంతుడు ఎవరి తలరాతను వారిచేతనే రాయిస్తాడు — ఎందుకంటే ఆత్మ వేరు, పరమాత్మ వేరు కాదు.
దేహం ఉన్నంతవరకే స్వార్థం, ఆశ, భయం, ప్రేమ వంటి లక్షణాలు ఉంటాయి.
ఆత్మ మాత్రం వివేకస్వరూపం.
మనలోని పంచభూతాలు మన జీవనాన్ని నిరంతరం నడిపిస్తాయి:
- నిద్రలో దేహాన్ని ఒక భూతం మాత్రమే కాపలా కాస్తుంది,
- మిగిలిన నాలుగు భూతాలలో ఒకటి మన పాప–పుణ్యాలకు లెక్క రాస్తుంది.
అదే "చిత్రగుప్తుడు" — ఆత్మలోనే గుప్తంగా ఉండి, మన కర్మలను చిత్రంలా నమోదు చేస్తాడు.
మిగిలిన మూడు భూతాలు మన ఆలోచనలను పర్యవేక్షిస్తాయి.
నిద్రలోనుండి లేచిన వెంటనే మనకు కాసేపు గందరగోళం ఎందుకు కలుగుతుందంటే —
భూతాలు మళ్ళీ దేహంలో స్థిరపడే వరకు పూర్తిస్థాయి సృహ కలగదు.
అందుకే వెంటనే లేచి పరిగెత్తకూడదు; రెండు నిమిషాలు నిశ్చలంగా ఉండాలి.
ధ్యానం, నామ జపం, ఆధ్యాత్మిక సాధన ఎందుకు అనుభూతులనిస్తుంది
సాధకులు అధికంగా జపధ్యానం చేస్తే —
స్వప్నంలో పుణ్యక్షేత్రాలు, దైవదర్శనం కలుగుతుంది.
ఎందుకంటే మనస్సు ఎక్కువగా దైవాన్ని తలుస్తూ, దివ్యభావమే అధికమవుతుంది.
అలా అస్ట్రల్ జర్నీ మొదట స్వప్నంలో ప్రారంభై, తర్వాత ధ్యాన స్థితిలో కూడా సంభవిస్తుంది.
జీవుడు దేహాన్ని విడిచిన తరువాత
దేహాన్ని విడిచిన జీవుడు, చేసిన కర్మల భారంతో రోదిస్తాడు.
మూల్యమైన మానవజన్మను వృధా చేసుకున్నందుకు బాధపడతాడు.
అయితే పుణ్యకర్మలు, దైవసేవ, ధార్మికాచరణ చేసినవారికి మళ్లీ మానవజన్మ లభిస్తుంది.
ఆత్మ, తన పాప–పుణ్యాల ఆధారంగా తన తలరాతను తానే రాసుకుంటుంది —
ఎలాంటి జీవితం గడపాలో, ఎలాంటి అనుభవాల ద్వారా విముక్తిని పొందాలో తానే నిర్ణయిస్తుంది.
అందుకే:
“నీ తలరాత నీ చేతనే రాసుకున్నది;
నీవు అనుభవిస్తున్న జీవితం నీ కర్మాల ప్రతిబింబమే.”
కాబట్టి దేవుడ్ని నిందించడం అసంబద్ధం.
దైవం ఎవరినీ తక్కువగా చూడదు
పాపులు, నీచులు, దౌర్భాగ్యులు, రాక్షస స్వభావం గలవారు —
ఎవరైనా దైవఆరాధనకు అర్హులే.
దైవానికి భేదభావం లేదు.
జీవుడు బ్రతికి ఉన్నంతకాలం మారటానికి ఎన్నో అవకాశాలు భగవంతుడు ఇస్తూనే ఉంటాడు.
బాధతో పాటు మంచి సూచనలను, మంచి అవకాశాలను కూడా పంపుతాడు.
వాటిని గుర్తించడం కోసం వివేకం కావాలి.
ఆ వివేకం రావడం కోసం:
- ఆధ్యాత్మిక సాధన
- ధ్యానం
- సేవ
- పారాయణం
- సత్సంగం
- గురుసేవ
- ఆలయదర్శనం
- ధానధర్మం
వాటిలో ఏదో ఒక మార్గాన్ని ఎంచుకుంటే —
మిగిలినవన్నీ సహజంగానే మన వెంటే వస్తాయి.
నామజపమే మనస్సు నిలకడకు శక్తి
మనసు నిలకడకు ముందు —
ఈశ్వర నామ జపమే ప్రధాన ఆయుధం.
దానితోనే మార్పు మొదలవుతుంది.
దానితోనే కర్మశాల శుభ్రపడుతుంది.
దానితోనే అంతరంగం జ్యోతి పొందుతుంది.
ఓం నమః శివాయ
ఓం నమః శివాయ
ఓం నమః శివాయ
శుభమస్తు
శ్రీ సద్గురు పీఠం
సమస్త లోకాః సుఖినో భవంతు




