నిరాశ లేకుండా సాధన మరల మరల చేయాలి

పరిపూర్ణ సిద్ధి పొందే మార్గం సుదూరమైనది మరియు క్లిష్టమైనది

Advertisement

భగవంతుని పై మనస్సు కేంద్రీకరించాలని మనం ధ్యానంలో కూర్చున్నప్పుడు, మనకు చాలా సార్లు తెలిసేదేమిటంటే, మనస్సు ప్రాపంచిక సంకల్ప వికల్పాలలో భ్రమించిపోతుంది♪. కాబట్టి ధ్యాన ప్రక్రియలో ఉన్న మూడు అంచెలని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది♪:

  1. బుద్ధి యొక్క విచక్షణా శక్తితో మనం ఈ ప్రపంచం మన లక్ష్యం కాదు అని నిర్ణయించుకోవాలి♪. కాబట్టి, మనం బలవంతంగా మనస్సుని ప్రాపంచికత్వం నుండి వేరు చెయ్యాలి. దీనికి పరిశ్రమ అవసరం♪.
  2. మరల, బుద్ధి విచక్షణ శక్తిచే భగవంతుడు మాత్రమే మనవాడని అర్థం చేసుకుని మరియు భగవంతుడిని పొందటమే మన లక్ష్యంగా చేసుకోవాలి♪. కాబట్టి, మనస్సుని తిరిగి తెచ్చి భగవంతుని పైనే కేంద్రీకరించాలి♪. దీనికి కూడా పరిశ్రమ అవసరం♪.
  3. మనస్సు భగవంతుని నుండి వేరుగా వచ్చేసి మరల ప్రపంచంలో తిరుగుతుంటుంది♪. దీనికి శ్రమ అవసరం లేదు, దానికదే అనాయాసముగా అయిపోతుంది♪. ఎప్పుడైతే, ఈ మూడవది దానికదే అయిపోతుందో, సాధకులు తరచుగా నిరాశ పడతారు, “భగవంతుని పై మనస్సు కేంద్రీకరించటానికి నేను చాలా ప్రయత్నించాను కానీ మనస్సు తిరిగి ఈ ప్రపంచంలోకి వెళ్లి పోయింది.” అని. శ్రీ కృష్ణుడు మనలను ఇలా నిరాశ పడవద్దు అంటున్నాడు♪. మనస్సు చంచలమైనదే, మనం ఎంత ప్రయత్నించినా అది సహజంగానే, తన ఆసక్తి ఉన్న చోటికి వెళ్ళిపోతుంది, అని ముందే అనుకోవాలి, అని అంటున్నాడు♪. కానీ, అది చంచలమై పోయినప్పుడు, తిరిగి మరోసారి, 1వ, 2వ ఉపాయం అవలంబించాలి – మనస్సుని ఈ ప్రపంచం నుండి దూరంగా తీసివేయాలి మరియు తిరిగి భగవంతునిపై కేంద్రీకరించాలి♪. మరల 3వ పని దానికదే అయిపోతుంది, అని మనకు అనుభవంలోకి వస్తుంది. మనం నిరాశ చెందకుండా, మరల 1వ, 2వ ఉపాయాలు ఉపయోగించు కోవాలి♪.

ఈ సాధనని మరల మరల చేయాలి♪. అప్పుడు క్రమక్రమంగా మనస్సు భగవంతునిపై అనుసంధానం పెరగటం మొదలవుతుంది♪. అదే సమయంలో, ప్రపంచం మీద వైరాగ్యం కూడా పెరుగుతుంది♪.

Advertisement

ఇది జరిగే క్రమంలో, ధ్యానం చేయటం ఇంకా ఇంకా సులువుగా అవుతుంది. కానీ, ప్రారంభంలో మనస్సుని క్రమశిక్షణ లోనికి తెచ్చే పోరాటానికి సిద్ధపడాలి 🙏

శ్రీ సద్గురు పీఠం ద్వారా…✍