సంప్రదాయాలు
మహాలయ పక్షం ప్రారంభం

(తర్పణ విధి – పూర్తి వివరణ) 1. ఆచమనం మంత్రాలతో నీటిని పానము చేయాలి: 2.
(తర్పణ విధి – పూర్తి వివరణ)
1. ఆచమనం
మంత్రాలతో నీటిని పానము చేయాలి:
Advertisement
ఓం కేశవాయ స్వాహా ఓం నారాయణాయ స్వాహా ఓం మాధవాయ స్వాహా ఓం గోవిందాయ నమః
2. పవిత్రం ధరించడం
- ధర్భ పవిత్రం ధరించాలి.
- మంత్రం తెలిసిన వారు చదవాలి.
3. భూతోచ్చాటనం
Advertisement
ఉత్తిష్ఠంతు భూత పిశాచా
యేతే భూమి భారకాః |
యేతేషామవిరోధేన
బ్రహ్మకర్మ సమారభే ||
నీటిని వెనుకకు వేయాలి.
4. ప్రాణాయామం
గాయత్రి మంత్రంతో ప్రాణాయామం చేయాలి.
Advertisement
5. సంకల్పం
తమ ప్రాంత పురోహిత సూచన ప్రకారం సంకల్పం చెయ్యాలి.
తర్పణ విధానం
ప్రాచీనావీతి
- యజ్ఞోపవీతం ఎడమ భుజం మీదకు మార్చాలి.
Advertisement
పితృ ఆహ్వానం
ఓం ఆగచ్చంతు మే పితరః
ఇమం గృహ్ణంతు జలాంజలిమ్
తిలతర్పణం
- దక్షిణ దిశకు తిరిగి, ఎడమ మోకాలి మీద కూర్చుని చేయాలి.
- ప్రతి పితృపేరును చెప్పి 3 మార్లు "స్వధానమస్తర్పయామి" అని తర్పణం చేయాలి.
- తండ్రి, తాత, ముత్తాత… అలాగే తల్లి వంశం, సోదరులు, సోదరీమణులు, అల్లుడు, మనవడు మొదలైన వారందరికి క్రమంగా తర్పణం చేయాలి.
ముగింపు శ్లోకాలు
యే బాంధవాః యే బాంధవాః యేయే అన్యజన్మని బాంధవాః | తే సర్వే తృప్తిమాయాంతు మయా దత్తేన వారిణా || ఆబ్రాహ్మస్తంబపర్యంతం దేవర్షి పితృమానవాః | తృప్యంతు పితరః సర్వే మాతృమతామహాదయః ||
ముఖ్య గమనికలు
- దేవతలకు → ఒక్క తర్పణం
- ఋషులకు → రెండేసి తర్పణాలు
- పితృలకు → మూడేసి తర్పణాలు
- ఋగ్వేదులు → ఋగ్వేద మంత్రాలు
- యజుర్వేదులు → యజుర్వేద మంత్రాలు
- ప్రతి అమావాస్య రోజున పితృ తర్పణం చేయాలి.
- గ్రహణ సమయంలో కూడా వర్తిస్తుంది.
- తిథి తెలియనివారు → అమావాస్య నాడు తప్పక తర్పణం చేయాలి.
తుదిపరమార్థం
మహాలయ పక్షం అనేది పితృకార్యాల సర్వోన్నత సమయం.
ఈ రోజుల్లో పితృదేవతలను స్మరించి, విధిగా తిలతర్పణం చేస్తే:
- వంశాభివృద్ధి
- ఆయురారోగ్యాలు
- పితృ ఆశీస్సులు
తప్పక లభిస్తాయి.




