homebanner

కంచి పరమాచార్య మహిమ | మా జీవితాలకు మాష్టర్ – నిజ జీవిత అనుభవం

కంచి పరమాచార్య మహిమ | మా జీవితాలకు మాష్టర్ – నిజ జీవిత అనుభవం

మా జీవితాలకు మాష్టర్

కంచి పరమాచార్య ధార్మిక సేవా ట్రస్ట్ (రి)

కంచి కామకోటి పీఠం శంకరాచార్యులు శ్రీ శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివార్లు నా మాష్టర్. వారు మా జీవితాల్లోకి ఎలా వచ్చారో చెబుతాను.

నాలుగేళ్ళప్పుడు మా అమ్మ చనిపోయారు. నేను ఉబ్బసంతో ఎన్నో సంవత్సరాలు చాలా బాధపడేవాడిని. కార్టికోస్టరాయిడ్స్ వల్ల ఉపశమనం ఉన్నా, వాటిని రోజూ వాడవలసి ఉంటుంది.

10-10-1971న నాగేశ్వరితో నా వివాహం జరిగింది. ఏడేళ్ళప్పుడు తను సిమ్లాలోని స్నోడౌన్ ఆసుపత్రికి వెళ్ళినప్పుడు తనకు ఒక కంటిలో చూపులేదని మరొక కన్ను కూడా ఎంతోకాలం ఉండదని తెలిసింది. కాని తన రాకతో మా జీవితాల్లో చాలా మార్పు వచ్చింది.

పెళ్ళైన సంవత్సరం తరువాత, జై ఆంధ్ర ఉద్యమం సమయంలో విజయవాడలో ఉన్నాము. రైల్వే స్టేషను దగ్గరలో ఉన్న మా అత్తగారి ఇంటిలో అపరాధి అయిన ఒక వ్యక్తి లాడ్జి నడుపుతూ ఉండడంతో, ఆ ఇంటిని స్వాదీనపరచుకోవడానికి వెళ్ళాము. మా కార్యం భగ్నం చెయ్యడానికి అతను చాలా పెద్ద ప్రయత్నాలే చేశాడు. దైవానుగ్రహంగా దుర్గాదేవి మమ్మల్ని కాపాడింది.

అప్పుడు నాకు తిరువణ్ణామలై వెళ్ళాలని సంకల్పం కలిగింది. అక్కడ మేము రమణ మహర్షి వారి ఉనికిని అనుభూతి చెందాము.
“నేను నీ గురువును కాదు, నీ గురువును ఒక గురువును వెతుకుతున్నాను” అన్న సందేశం నాకు దొరికింది.

తర్వాత జరిగిన ఒక చిన్న సంఘటన నా జీవితాన్ని పూర్తిగా మార్చింది. ఆశ్రమం బయటకు వస్తున్నప్పుడు ఒక వ్యక్తి ఒక పుస్తకాన్ని నా చేతిలో పెట్టి — “చాలా మంచి పుస్తకం, కేవలం అయిదు రూపాయలు” అన్నాడు. అదే డా. పాల్ బ్రంటన్ గారి “ది సెర్చ్ ఇన్ సీక్రెట్ ఇండియా”.

ఆ పుస్తకం చదివిన తరువాత “స్పిరిచ్యుయల్ హెడ్ ఆఫ్ సౌత్ ఇండియా” అనే అధ్యాయం చూసి ఆశ్చర్యపోయాను. ఆ మహానుభావుడు కంచి పరమాచార్య అని తెలిసింది.

నెల్లూరు నుండి రెండు బస్సులు మారి తెనంబాక్కం చేరేటప్పటికి సాయంత్రం అయ్యింది. బావిలో నుండి చెక్క పాత్రతో నీటిని తోడుతుండగా మొదటిసారి స్వామివారిని చూశాను.

స్వామి సేవకులు శ్రీకంఠన్ “ఆంధ్ర-కర” అని చెప్పారు. నా ఉబ్బసం సమస్య గురించి చెప్పారు. స్వామివారు వేళ్లతో నాపై నీటిని చిలకరించారు. అంతే.

ఆగస్ట్ 23, 1973 — స్వామివారితో నా మొదటి దర్శనం.


ఈకాంత దర్శనం

రెండవసారి మధ్యరాత్రిలో తెనంబాక్కం చేరుకున్నాను. చిరుజల్లు పడుతోంది. నేను అక్కడే మట్టినేలపైన పడుకున్నాను.

రాత్రి రెండు గంటల సమయంలో స్వామివారు నిదానంగా బావివైపుగా నడిచారు. నేలను ఊడ్చి, టబ్బులో స్నానం చేశారు.

దాదాపు రెండు గంటలపాటు నేను అక్కడే ఉండి స్వామివారిని గమనించాను. ఆ ఈకాంత దర్శనం నా జీవిత కోరికలను నెరవేర్చింది.


మాష్టర్ దృష్టి

మూడవసారి దర్శించుకున్నప్పుడు మాష్టర్ నా కళ్ళల్లోకి చూశారు.
అప్పుడు ఒక అద్భుతమైన శక్తి నాలోకి ప్రవేశించిన భావన కలిగింది. అప్పటి నుండి నా ప్రవర్తనలో పెద్ద మార్పు వచ్చింది.

నాల్గవసారి వెళ్ళినప్పుడు నేను నిజమైన భక్తుడినని స్వామివారికి అర్థమైంది. ఆ మాటలు నా జీవితంలో ఎన్నో కష్టాలనుండి నన్ను కాపాడాయి.


ఆశీర్వాదం

ఉగాది రోజున స్వామివారు నాకు పుత్రసంతానం కలుగుతుందని ఆశీర్వదించారు.

తర్వాత మా జీవితాల్లో జరిగిన అనేక సంఘటనలు స్వామివారి అనుగ్రహాన్ని చూపించాయి. ఒకసారి నా భార్యను తెలుకరచింది. నేను భయంతో స్వామివారి దగ్గరకు వెళ్ళాను. వారు “భయపడాల్సిన అవసరం లేదు” అని చెప్పారు. నిజంగానే కొద్ది సేపటికి నొప్పి తగ్గింది.


గజేంద్ర మోక్షం

మాష్టర్ దగ్గర నేను తరచూ గజేంద్ర మోక్షం పద్యాలు పాడేవాడిని. స్వామివారు ఆనందంగా “మరొక్కసారి” అని చెప్పేవారు.

ఒకసారి భారతదేశ ఉపరాష్ట్రపతి డా. శంకర్ దయాళ్ శర్మ స్వామివారిని కలిసిన రోజు కూడా పద్యాలు చెప్పమన్నారు.


గోవు ప్రసంగం

తిరుపతిలో మాష్టర్ కోసం ఒక గోవును కొనుగోలు చేశాము. దాన్ని మఠానికి తీసుకురావడానికి స్వామివారే లారీ పంపించారు.

గోవును చూసి స్వామివారు తమ కడుపును తడుతూ
“దాని పాలు ఈ కడుపుకే” అని ఆనందపడ్డారు.


ఉపనయనం

మా కుమారుడు సరస్వతి చంద్రశేఖర్ ఉపనయనం స్వామివారి సమక్షంలో జరిగింది.

మాష్టర్ ధరించిన బిల్వమాలను స్వయంగా పిల్లవాని మెడలో వేసి ఆశీర్వదించారు. కార్యక్రమం తరువాత నాకు ఇచ్చిన ఇత్తడి పాత్రను మేము అక్షయపాత్రగా భావిస్తున్నాము.


అద్భుతమైన కంటి చికిత్స

నా భార్యకు రెంటినల్ పెగ్మెంటోస అనే వ్యాధి వచ్చింది. చాలా సంవత్సరాలు చూపు లేకుండా ఉండిపోయింది.

తరువాత మదురైలోని అరవింద్ ఐ హాస్పిటల్ లో శస్త్రచికిత్స జరిగింది. వైద్యులు కూడా ఆశ్చర్యపోయేలా —
పదేళ్ళ తరువాత ఆమెకు చూపు వచ్చింది.

ఈ సంఘటనను చాలా మంది వైద్యులు అద్భుతంగా పేర్కొన్నారు.


మాష్టర్ అనుగ్రహం

మాష్టర్ నాకు రెండు మంత్రాలను ఇచ్చారు:

  • జ్వరానికి గరుడ మంత్రం
  • ఉబ్బసం తగ్గడానికి సవిత్ర మంత్రం

వాటి అనుష్ఠానం వల్ల నాకు ఎంతో ఉపశమనం కలిగింది.


ముగింపు

తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు

పరమపూజ్య జగద్గురు శంకరాచార్య శ్రీ శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామివారు విశ్వమానవాళికి ఆశాకిరణం. వారి దయ వల్ల విశ్వశాంతి కలుగుగాక.

ఆర్. సుబ్బరామయ్య, M.Sc.
(kamakoti.org నుండి)


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం
శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ॥


Telegram Channel

కంచి పరమాచార్య వైభవం తెలుసుకోవడానికి:

t.me/KPDSTrust

blank

Hindu

About Author

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

You may also like

blank
homebanner పండుగలు

దసరా: హిందూమతంలో 9 రోజుల ప్రాముఖ్యత

  • September 30, 2024
దసరా, విజయదశమి అని కూడా పిలుస్తారు, ఇది నవరాత్రి అని పిలువబడే 9 రోజుల పాటు జరుపుకునే ప్రధాన హిందూ పండుగ. ప్రతి రోజు లోతైన ఆధ్యాత్మిక
blank
homebanner పండుగలు

బతుకమ్మ పండుగ: తెలంగాణకు ప్రాముఖ్యత

  • September 30, 2024
బతుకమ్మ తెలంగాణలో అత్యంత శక్తివంతమైన మరియు సాంస్కృతికంగా ముఖ్యమైన పండుగలలో ఒకటి, దీనిని ప్రధానంగా మహిళలు జరుపుకుంటారు. ఇది తెలంగాణ సాంస్కృతిక స్ఫూర్తిని సూచించే పూల పండుగ