జ్ఞానం ఎప్పుడు కలుగుతుంది?

భగవంతుని యందు భక్తి భావన వల్ల కొంత వియోగం దుఃఖము అనుభవింప వలసి వస్తుంది.
( రూప నామములే నమ్మి నందు వల్ల)అది కూడా మార్గమే!… అందువల్ల “అంతర్యామిగా మీరు నన్ను చూసి నట్లయితే, అప్పుడు మీకు వియోగ దుఃఖము ఉండదు, మనస్సు లో శాంతి ననుభవిఁపగలరు,” అని ఈశ్వర తత్వాన్ని గోపి కలకు చెప్పాడు కృష్ణ పరమాత్మ.
ఇది మనందరికీ శిరోధార్యములైన మాట!!…
లోకంలో భూత ప్రేత పిశాచాలను ఆరాధనచేసి నిధులు పొందిన వారున్నారు.
అవి ఈశ్వరుడే ఇవ్వవలసిన అవసరం లేదు.
మరి భక్తులకు ఆయన ఏమి ఇస్తాడు అంటే!!… ఎవ్వరూ ఇవ్వలేని వస్తువునే ఆయన ఇవ్వాలి మరి.
అది సృష్టి లో ఇంకెవ్వరూ ఇవ్వలేరు ఈశ్వరుడు తప్ప, అట్టి వస్తువునే తానివ్వాలి.
అదే ఆయన అధికారానికి తగినట్లుంటుంది.
అట్టి వస్తువు ఏమిటంటే!!… అది జ్ఞానమే!
చరిత్రలో అనేక మంది భక్తులు దరిద్రాన్ని అనుభవించారు, అయినా వాళ్ళు ఆయన కనపడినా కూడా ధనం అడగలేదు.
ఈశ్వరానుగ్రహాన్ని, జ్ఞానాన్ని మాత్రమే కోరుకున్నారు, పొందారు.
తాను అనుభవించే సుఖ దుఃఖా లు, తన చేసుకున్న కర్మ ఫలితాలే అనే జ్ఞానం కలగాలి.
ఈ రెండింటియందూ సమ భావం తో ఉండాలి.
ఈ ప్రకారంగా తెలుసుకుని, చివరకు నేనే దైవం, శత్రువులు, మిత్రులు ఎవరూ లేరు, అందరూ దైవస్వరూపులే !… నేనే దైవం అనే జ్ఞానం కలుగుతుంది.
శుభమస్తు 🙏 శ్రీ సద్గురు పీఠం ద్వారా…✍️
సమస్త లోకా సుఖినోభవంతు 🙏
