బ్రాహ్మణులు దుర్మార్గులా? సమాజం ఆలోచించాల్సిన చేదు నిజం

బ్రాహ్మణులు అంత దుర్మార్గులా? సమాజం ఆలోచించాల్సిన చేదు నిజం!
ఈ రోజుల్లో సోషల్ మీడియా తెరిచినా, రాజకీయం చూసినా ఒకటే మాట వినిపిస్తోంది.. “బ్రాహ్మణుల వల్లనే అంటరానితనం పెరిగింది, వారే సమాజాన్ని తొక్కేశారు” అని. కొందరు స్వార్థపరులు తమ రాజకీయ పబ్బం గడుపుకోవడానికి, అంబేద్కర్ గారి పేరును అడ్డం పెట్టుకుని ‘జై భీమ్’ అంటూ కులాల మధ్య చిచ్చు పెడుతున్నారు. కానీ ఒక్కసారి నిష్పక్షపాతంగా ఆలోచిద్దాం రండి.
బానిసత్వం అంటే కేవలం కులం మాత్రమేనా?
నిజంగానే బ్రాహ్మణుల వల్ల అంటరానితనం జరిగిందనే వాదనను కాసేపు నిజమని ఒప్పుకుందాం. కానీ, 800 ఏళ్లకు పైగా ఈ దేశాన్ని ముస్లిం పాలకులు ఏలారు కదా? అప్పుడు భారతీయులంతా బానిసలుగా బతకలేదా?
200 ఏళ్ల పాటు బ్రిటిష్ వారు మనల్ని పీల్చి పిప్పి చేశారు కదా? మనల్ని కనీసం మనుషులుగా కూడా చూడని ఆ తెల్లదొరల పాలన బానిసత్వం కాదా?
మనల్ని బానిసలుగా చూసిన, లక్షలాది మంది చావులకు కారణమైన ఆ విదేశీ మతాలను (ఇస్లాం, క్రైస్తవం) ఈ రోజు నెత్తిన పెట్టుకుంటున్నారే.. ఎందుకు? వారిని ఎందుకు ద్వేషించట్లేదు? వారిని ఎందుకు ప్రశ్నించట్లేదు?
జిజియా పన్నులు వేసిన వారిపై లేని కోపం.. మన బ్రాహ్మణుడిపై ఎందుకు?
”మా దేవుడిని నమ్మకపోతే మీకు ఈ భూమి మీద బతికే హక్కు లేదు, బతకాలంటే జిజియా టాక్స్ కట్టాలి” అని అరాచక చట్టాలు తెచ్చిన మతాల పట్ల లేని ఆగ్రహం.. ఇక్కడే పుట్టి, ఇక్కడే పెరిగిన బ్రాహ్మణుల మీద ఎందుకు చూపిస్తున్నారు?
కేవలం బ్రాహ్మణులేనా? రెడ్డి, కమ్మ, కాపు ఇలా ప్రతి కులంలోనూ వేరే వర్గాన్ని తక్కువగా చూసేవారు ఉన్నారు. అది తప్పే, ఎక్కడ జరిగినా ఖండించాల్సిందే. కానీ ప్లాన్ ప్రకారం కేవలం బ్రాహ్మణులను మాత్రమే ‘బూచి’గా చూపిస్తూ, విదేశీ మతాలను ఆదరించడం వెనుక ఉన్న కుట్రను గమనించారా?
మనం ఎటు వెళ్తున్నాం?
మనల్ని బానిసలుగా చూసిన ఇస్లాంని, క్రైస్తవ్యాన్ని నెత్తిన పెట్టుకుంటూ.. మనవాడైన బ్రాహ్మణుడిని మాత్రం నిందిస్తారా? మనల్ని మనుషులుగా కూడా చూడని సంస్కృతుల పట్ల ప్రేమ చూపిస్తూ, మన ధర్మాన్ని రక్షించే వారిని తిడతారా? ఇలాంటి వారికి అసలు బ్రాహ్మణుల గురించి మాట్లాడే అర్హత ఉందా?
సమాజమా.. ఒక్కసారి ఆలోచించు! కులాల పేరుతో మనల్ని విడగొట్టి, విదేశీ సిద్ధాంతాలను మనపై రుద్దాలని చూస్తున్న సంఘవిద్రోహ శక్తుల పట్ల అప్రమత్తంగా ఉందాం. రాజకీయ నాయకుల పబ్బం కోసం మన ధర్మాన్ని, మన మనుషులను బలి ఇవ్వద్దు.
నిజం నిలకడ మీద తెలుస్తుంది.. ఆలోచించే వారికి ఇది ఒక హెచ్చరిక!
