చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకులు సౌందర్య రాజన్ గారికి నివాళి

గౌరవనీయులు పెద్దలు శ్రీశ్రీ సౌందర్య రాజన్ గారు చిలుకూరు బాలాజీ దేవాలయ ప్రధాన అర్చకులు ఈ దినమున వైకుంఠ ప్రాప్తి చేయడం జరిగింది. ఆయనకు ఆయన కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాం. ముఖ్యంగా కీర్తిశేషులు డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రివర్యులు ఆయన దగ్గర నుండి ఇప్పటివరకు ఈ ప్రభుత్వము వరకు ఆయన అర్చకుల కోసం అహర్నిశలు కష్టపడి అర్చకులు హక్కుల సాధనకై ఎన్నో ఎన్నెన్నో ప్రభుత్వ జీవోలు కమిషనర్ గారు సర్కులర్లు ఇప్పించడం వెనక ఆయన కృషి ఎనలేనిది. అటువంటి మహోన్నతమైన వ్యక్తి అర్చక లోకంలో ఒక ధ్రువతారగా ఎప్పటికీ మిగిలి ఉంటారని ఆయన భౌతికంగా లేనప్పటికీ ఆయన మన వెంటే ఉంటారని ఆయనకు ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాం. 🌹🌹🌹
ఇట్లు
ఏపీ అర్చక సమాఖ్య
రాష్ట్ర అధ్యక్ష మరియు కార్యదర్శులు
శ్రీ అగ్నిహోత్రం ఆత్రేయ బాబు గారు
శ్రీ పెద్దింటి రాంబాబు గారు
శ్రీ పలుకూరి శ్రీనివాసులు గారు.
