లడ్డూలు- చీమలు: ఓ సూక్తి కథ

శ్రీ రామకృష్ణ పరమహంస చెప్పిన చిన్న సంఘటన
ఒకరోజు కాళీమాత ఆలయంలో ప్రసాదంగా ఇవ్వడానికి లడ్డూలు తయారు చేస్తున్నారు. అనుకోకుండా చీమలు లడ్డూలపై చేరాయి. లడ్డూ తయారు చేస్తున్నవారు అవి ఎలా పోగొట్టాలో తెలియక రామకృష్ణ పరమహంస గారిని అడిగారు.
అప్పుడు పరమహంస గారు “చీమలు వస్తున్న దారిలో చక్కెర పొడి చల్లండి. వాటిని తీసుకుని చీమలు వెళ్ళిపోతాయి, ఇక ఇటు రావు” అని సూచించారు. అలా చేయగానే చీమలు చక్కెర రుచి చూసి లడ్డూలను వదిలేసి వెళ్లిపోయాయి.
🌿 పరమహంస గారి బోధన:
“మనుషులు కూడా చీమల్లాంటి వారే. మొదట ఒక లక్ష్యాన్ని నిర్ణయించుకుంటారు, కానీ మధ్యలో చిన్న చిన్న ప్రలోభాలకు లోనై మార్గం మరిచిపోతారు. చీమలు లడ్డూని వదిలేసి చక్కెర పొడితో సంతృప్తి చెందినట్టే, మనం కూడా భగవంతుని సాధన ప్రారంభించినా మార్గమధ్యలో ఎక్కడో ఆగిపోతుంటాము.”
👉 సత్యమైన ఆనందాన్ని పొందే వారు చాలా అరుదు!
👉 చిన్న చిన్న లాభాలతో తృప్తి చెందకుండా, జీవన లక్ష్యం వైపే దృష్టి సారించాలి!
🌸 హరహర మహాదేవ్ 🌸
🌿 స్వస్తి
