శుభోదయం |¦¦|

𝕝𝕝ॐ𝕝𝕝 సుభాషితమ్ 𝕝𝕝卐𝕝𝕝
🌿 శ్లోకం 🌿
ధరణిలో వెయ్యేండ్లు తనువు నిల్వగబోదు,
ధనమెప్పటికి శాశ్వతంబు గాదు,
దార సుతాదులు తన వెంట రాలేరు,
భృత్యులు మృతిని దప్పింపలేరు,
బంధుజాలము తన్ను బ్రతికించుకొనలేదు,
బలపరాక్రమ మేమి పనికిరాదు,
ఘనమైన సకల భాగ్యంబెంత గల్గియు
గోచిమాత్రంబైన గొంచుబోడు,
వెఱ్ఱికుక్కల భ్రమలన్ని విడిచి నిన్ను
భజన జేసెడి వారికి బరమ సుఖము
భూషణ వికాస! శ్రీ ధర్మపుర నివాస!
దుష్టసంహార! నరసింహ! దురితదూర!
|| నరసింహ శతకం ||
🌼 తాత్పర్యం 🌼
ఎవరూ వెయ్యేండ్లు జీవించరు.
ధనం శాశ్వతం కాదు.
మరణానంతరం భార్య, పిల్లలు, బంధువులు, సేవకులు — ఎవరూ వెంటరారు.
బంధువులు మన ప్రాణాన్ని కాపాడలేరు; బలం, పరాక్రమం కూడా పనికిరాదు.
అందువల్ల వెఱ్ఱి మమకార భ్రమలను విడిచి,
అశాశ్వతమైన లోక విషయాలను త్యజించి,
శాశ్వతమైన ముక్తికోసం నరసింహ స్వామిని భజించడం
జీవితంలో అత్యుత్తమమైన సుఖం.
